జాతీయ వార్తలు
ఒకేరోజు 3 టీఎంసీలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 June 2018
బళ్లారి, జూన్ 14: తుంగభద్ర జలాశయ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే 3 టీఎంసీల నీరు వచ్చి చేరింది. గత మూడు రోజులుగా తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో కర్నాటక, ఆంధ్ర పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం నీటిమట్టం 1568.80 అడుగులు ఉండగా నేడు 1586.95 అడుగులకు చేరుకుంది. గత ఏడాది 0.92 టీఎంసీల నీరు ఉండగా నేడు 7.75 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వచ్చే వారం రోజుల్లో జలాశయానికి 15 నుంచి 25 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని జలాశయం అధికారులు భావిస్తున్నారు.