జాతీయ వార్తలు

టీడీపీ ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో బీజేపీపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చే బాధ్యత తమదేనని ఆయన స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి రాష్ట్ర అధికారులకు కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు. దానికి రాష్ట్ర అధికారులు స్టీల్ ప్లాంట్ సాధ్యం కాందని జూన్‌లో నివేదిక ఇచ్చారని, అనంతరం బీజేపీ అధ్యక్షుడి చొరవతో మరోసారి పరిశీలించాలంటూ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ కలిపి నివేదిక అందజేస్తే కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, నిర్మాణ చర్యలు మొదలు పెడుతుందని అన్నారు. అలాగే సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన నివేదికలో ఎక్కడా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులకు సిగ్గు, లజ్జా లేవని, అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నాటకాల ఆపాలని, స్టీల్ ప్లాంట్‌కోసం ఎవరూ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని కన్నా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కడపకు తెచ్చే బాధ్యత తమదేనని కన్నా మరోమారు స్పష్టం చేశారు.