జాతీయ వార్తలు

ఐఏఎస్‌ల సమ్మె విరమింపజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ఐదురోజులుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి తాజాగా ప్రధానికి లేఖ రాశారు. గత నాలుగు నెలలుగా జరుగుతున్న ఐఏఎస్ అధికార్ల సమ్మెను విరమింపచేయాలని ఆయన ఆ లేఖలో నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కొన్ని టీవీ ఛానళ్లలో వస్తున్న ‘ఏసీ సోఫా కా ధర్నా’ వ్యాఖ్యలకు, ‘వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి నేనిక్కడ ధర్నా చేయడంలేదు. ఢిల్లీ ప్రజలకు మంచి చేద్దామన్నదే నా ఉద్దేశం’ సమాధానమిచ్చారు. ఇదిలావుండగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలో తన సహచర మంత్రులతో కలిసి కేజ్రీవాల్ చేస్తున్న ధర్నా వరుసగా ఐదోరోజుకు చేరుకుంది.