జాతీయ వార్తలు
అమర్నాథ్ యాత్రలో వలంటీర్ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 July 2018
శ్రీనగర్, జూలై 1: అమర్నాథ్ యాత్రలో వలంటీర్గా ఉన్న ఒక వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సేవాదార్ (వాలంటీర్)గా వ్యవహరిస్తున్న గుజరాత్కు చెందిన బానోభాయ్ గదియా (62) పహల్గాం ప్రాంతంలోని నున్వాన్ బేస్ కాంప్లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఏడాది జూన్ 28న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇది రెండో మృతి. యాత్ర మొదటి రోజున విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఛాతి నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే.
చిత్రం..అమర్నాథ్ యాత్రకు జమ్మూ నుంచి ఆదివారం
బయలుదేరుతున్న ఆనందంలో సాధువులు