జాతీయ వార్తలు
ఊపిరాడక 18 ఆవులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 August 2018
రాయిపూర్, ఆగస్టు 5: ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్ జిల్లా రోహాసీ గ్రామంలో నిర్వహిస్తున్న సెంటర్లో ఊపిరాడక 18 ఆవులు మృతి చెందాయి. ఇదే కేంద్రంలో ఉన్న మరో 18 పశువులు కోలుకున్నాయని జిల్లా కలెక్టర్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రామం నుండి 70 కి.మీ దూరంలోకి రాష్ట్ర రాజధానికి పశువులను తరలించేందుకు ఒక కేంద్రంలో సిద్ధంగా ఉంచారని అధికారులకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేపట్టగా ఒక గదిలో కొద్దిరోజులుగా పశువులను నిర్బంధించడంతో ఊపిరాడక దాదాపు 18 పశువులు మృతి చెందాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.