జాతీయ వార్తలు

శరద్ పవార్ పోటీ చేయరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 6: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. ఆ పార్టీ నాయకుడు జితేంద్ర అహ్వద్ శనివారం ఇక్కడ ఈ విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి పవార్ పోటీ చేస్తారనే ఊహాగానాలకు అహ్వద్ ప్రకటన ముగింపు పలికింది. తాను మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని పవార్ 2014లోనే స్పష్టం చేశారని అహ్వద్ శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల రేస్‌లో తాను లేనని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, అందువల్ల అభ్యర్థుల ఖరారు సమయంలో తన పేరును పరిశీలనలోకి తీసుకోవద్దని పవార్ పార్టీకి స్పష్టం చేశారని ముంబ్రా-కల్వా ఎన్‌సీపీ ఎమ్మెల్యే అయిన అహ్వద్ తెలిపారు.