జాతీయ వార్తలు

యువత కలలను కల్లలు చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూటు, బూటు స్నేహితులను రాఫెల్ యుద్ధ విమానంలో ఊరేగిస్తూ యువకుల కలలను మట్టిలో కలిపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా విమర్శల గుప్పించారు. తనను ప్రధాన మంత్రిని చేస్తే రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానంటూ 2014లో ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చకుండా యువతను మోసం చేశాడు. పెద్దనోట్ల రద్దులో తనకు సహకరిస్తే నల్లధనాన్ని వెలికి తీస్తానంటూ మరోసారి మోసం చేశాడని రాహుల్ ఆరోపంచారు. 2014 నుండి దేశ ప్రజలను మోసం చేస్తున్న నరేంద్ర మోదీ 2018లో మాత్రం తన సూటు బూటు స్నేహితులను రాఫెల్ యుద్ధవిమానం ఎక్కించి యువకుల కలలను మట్టిలో కలిపేశారంటూ రాహుల్ దుమ్మెత్తిపోశారు.