జాతీయ వార్తలు

మా ఆయనే గెలుస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, నవంబర్ 24: మా ఆయనే గెలుస్తారంటూ మానే్వంద్రసింగ్ భార్య చిత్రాసింగ్ ధీమాగా చెబుతున్నారు. చిత్రాసింగ్ ఎవరంటే బీజేపీ దివంగత నేత జస్వంత్‌సింగ్ సింగ్ కోడలు. జస్వంత్ కుమారుడు మానే్వంద్ర సింగ్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేస్తున్నారు. జాల్‌రాపటాన్ నియోజకవర్గం నుంచి రాజేతో మానే్వంద్ర తలపడుతున్నారు. 2013 ఎన్నికల్లో బార్మేర్ జిల్లా షియో నుంచి బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ 2014లో బీజేపీ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నిక ముందే కాంగ్రెస్‌లో చేరిన మానే్వంద్రసింగ్‌ను ఏకంగా సీఎం రాజేపైనే పోటీకి నిలబెట్టారు. ఎన్నికల్లో మానే్వంద్ర తరఫున ఆయన భార్య చిత్రాసింగ్ కాళ్లకు బలపం కట్టుకుని గడపగడపకూ ప్రచారం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన భర్త గెలుస్తారని ఆమె ధీమాగా చెబుతున్నారు. తల్లీ,కొడుకుల పెత్తనంపై నియోజకవర్గం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆమె తెలిపారు. వసుంధరరాజే ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ అరాచకాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, కచ్చితంగా తన భర్త గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాజేపై తీవ్ర అసంతృప్తితో జనం ఉన్నారని, సారి కొత్త వ్యక్తిని గెలిపించాలని నిర్ణయించుకున్నారని మానేంద్ర సింగ్ భార్య పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లడుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రాసింగ్ స్పష్టం చేశారు. కాగా బీజేపీ ప్రభుత్వం, రాజేపై ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకుంటే గెలుపుసునాయాసమని మానే్వంద్రసింగ్ స్పష్టం చేశారు.
అలాగే సీఎం వసుంధర రాజే గెలుపుఅంత సులువుకాదని స్థానిక రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రిపై మానే్వంద్రనే గట్టి అభ్యర్థి అని వారన్నారు.

చిత్రం..బీజేపీ దివంగత నేత జస్వంత్‌సింగ్ సింగ్ కోడలు చిత్రాసింగ్