జాతీయ వార్తలు

మహిళలకే అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాల్వార్ (రాజస్థాన్), డిసెంబర్ 7: జేడీ నేత, మాజీ కేంద్రమంత్రి శరద్‌యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచే విధంగా శరద్ యాదవ్ మాట్లాడారన్నారు. ఈ విషయమై కేంద్రెన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తన శరీరంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటువంటి తరహా భాష ఉపయోగించకుండా ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలన్నారు. తన నియోజకవర్గంలో ఆమె ఓటు వేసిన తర్వాత విలేఖర్లతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. వసుంధర రాజెకు విశ్రాంతి ఇవ్వాలని, ఆమె లావు అయిందని శరద్ యాదవ్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. కాగా తాను జోక్‌గా మాత్రమే అన్నానని శరద్ యాదవ్ అన్నారు. ఆమె తనకు చాలా సంవత్సరాలుగా బాగా తెలుసన్నారు. ఆమెను తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.