జాతీయ వార్తలు

విశాఖ అడవుల్లో విమాన శకలాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 30: చెన్నై ఎయిర్‌బేస్ నుంచి గత 22న గల్లంతైన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన విమానంలో మొత్తం 22 మంది ఉండగా, వీరిలో విశాఖ నేవల్ ఆర్మ్‌డ్ డిపో (ఎన్‌ఎడి)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు విమానం ఆచూకీ లభ్యతపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో...విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలు కన్పించాయంటూ గుంటూరు జిల్లా సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అదనపు ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ప్రదీప్ కుమార్ తమకు అందిన సమాచారం మేరకు నాతవరం మండలం అటవీ ప్రాంతంలో గాలింపు చేపడుతున్నట్టు వెల్లడించారు. నాతవరం అటవీ ప్రాంతంలో విమాన శకలాల కోసం గాలిస్తున్నట్టు నర్సీపట్నం డివిజనల్ ఫారెస్టు అధికారి డి శేఖర్‌బాబు శనివారం రాత్రి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.