జాతీయ వార్తలు

ఆదర్శ్ భవనం ఆర్మీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 30: సుప్రీం కోర్టు ఆదేశం మేరకు సైనిక దళం దక్షిణ ముంబయిలోని కొలాబాలో ఆదర్శ్ కుంభకోణంతో కళంకితమైన బహుళ అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. సైనిక సిబ్బందితో కూడిన ఒక బృందం శుక్రవారం వివాదాస్పదమైన ఈ ప్రదేశానికి చేరుకుని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ నుంచి అధికారికంగా ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించింది. కార్గిల్ యుద్ధ యోధులు, ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమర సైనికుల భార్యలకోసం విలాసవంతమైన ప్రదేశంలో ఈ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫున సైనిక దళం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుంటోంది.