జాతీయ వార్తలు

‘అగస్టా’లో కాంగ్రెస్ నేతలకు 150 కోట్ల లంచం: యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 31: యూపీఏ హయాంలో జరిగిన అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంలో కాంగ్రెస్ నేతలకు రూ.150 కోట్లు లంచంగా అందిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఆ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వార్థం కోసం దేశరక్షణను, పౌరుల భద్రతను పణంగా పెట్టిందని విమర్శించారు. రూ.3,700 కోట్ల విలువైన అగస్టా హెలికాప్టర్‌ల కోనుగోలులో రూ.360 కోట్లు లంచంగా చేతులు మారాయని, అందులో 150కోట్లు కాంగ్రెస్ నేతల వద్దకు చేరాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మిచెల్‌ను అందుకే భారత్‌కు రప్పించామని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏ రంగాన్ని వదలలేదని, భూమి, నీరు, ఆకాశం, పాతాళం, అంతరిక్షం ఇలా అన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు.