జాతీయ వార్తలు

సిద్దరామయ్యకు పుత్రశోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 30: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు రాకేశ్ శనివారం బెల్జియంలో కన్నుమూశారు. శరీరంలోని అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల రాకేశ్ చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సిద్దరామయ్య పెద్ద కుమారుడైన రాకేశ్ గత వారం స్నేహితులతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్లారు. మంగళవారం అకస్మికంగా కడుపులో క్లోమగ్రంథికి సంబంధించిన సమస్య రావటంతో బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని ఆంట్వెర్ప్ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్పించారు. తన కుమారుడికి మంచి వైద్యం అందేలా చేయాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు కూడా. అయితే పదిహేనేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో రాకేశ్ కడుపులో తీవ్రమైన గాయమైంది. అప్పుడే ఆసుపత్రిలో చాలాకాలం ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే చోట ఆరోగ్య సమస్య రావటంతో పాటు శరీరంలోని మిగతా భాగాలూ పనిచేయకపోవటంతో రాకేశ్ మరణించినట్లు పేర్కొన్నారు.

చిత్రం.. సిద్దరామయ్య పెద్ద కుమారుడు రాకేశ్