జాతీయ వార్తలు

చితకబాది..మూత్రం తాగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్భంగా, జూలై 30: మంత్రగత్తెగా ముద్రవేసి ఒక దళిత మహిళను చితకబాదడంతో పాటు ఆమె మూత్రాన్ని ఆమెతోనే తాగించిన అమానుష ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలోని పిప్రా గ్రామంలో నలుగురు వ్యక్తులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు శనివారం తెలిపారు. చేతబడులు చేస్తోందని ఆరోపిస్తూ నలుగురు వ్యక్తులు గురువారం ఒక దళిత మహిళను చితకబాదారని, తరువాత బలవంతంగా ఆమె మూత్రాన్ని ఆమెతోనే తాగించారని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డిపిఒ) అంజని కుమార్ చెప్పారు. ఈ ఘటన తరువాత గ్రామం నుంచి వెళ్లిపోయిన సదరు దళిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని వివరించారు. గ్రామంలో కొంత మంది పిల్లలు అనారాగ్యానికి గురికావడంతో, సదరు దళిత మహిళ వారికి మంత్రాలు వేసిందని కొంతమంది గ్రామస్తులు విశ్వసించిన నేపథ్యంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. దళిత మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదా? అనేది ఆయన వెల్లడించలేదు. నిందితులను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేది కూడా చెప్పలేదు.