జాతీయ వార్తలు

హైకోర్టు భవన నిర్మాణంలో బాబు ఘోర విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఆంధ్రప్రదశ్ నూతన హైకోర్టు భవనాల నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్లమెంట్ అవరణలో ప్లకార్డు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను తానే నిర్మించానంటూ చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన సమయంలో హైకోర్టు భవనాన్ని నిర్మించలేదని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన చేసి అమరావతికి తరలించడం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 600 హామీల అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల కోసం శంకుస్థాపనల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. ఈ సారి రాష్ట్ర ప్రజలు తగిన విధంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు.