జాతీయ వార్తలు
హోదా కోసం నేడు ఢిల్లీలో ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 January 2019
న్యూఢిల్లీ, జనవరి 2: ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ హోదా సాధన సమితి నేతృత్వంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు దేశ రాజధానిలోని జంతర్మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీకి న్యాయం చేయాలని గురువారం, శుక్రవారం ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాట్టు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షా పార్టీలతో పాటు, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు పాల్గొనున్నట్టు రామకృష్ణ వెల్లడించారు.