జాతీయ వార్తలు

సంక్షేమం భిక్ష కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 4: రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, అవినీతికి పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని సినీనటుడు, మక్కల్ నీది మయమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హసన్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ తనను కలిసేందుకు వచ్చి డబ్బు ఖర్చుపెట్టకుండా, పేదల సంక్షేమానికి ఆ సొమ్మును వెచ్చించాలని కోరారు. సమకాలీన రాజకీయాల్లో బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతం పెచ్చుమీరిందన్నారు. వ్యక్తిగత ప్రశంసలకు ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు. రాజకీయాల్లో అనైతికత పెరిగిందన్నారు. రాజకీయాల్లోకి అవినీతిపరులు ప్రవేశించి సంపాదన లక్ష్యంగా అక్రమ మార్గాలు తొక్కుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో చీకటి యుగం నాటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమన్నారు.