జాతీయ వార్తలు

‘నీట్’లో వైఫల్యం.. మరో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచిరాపల్లి, జూన్ 7: నీట్‌లో వైఫల్యాలు విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తమిళనాడులో తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో సుభశ్రీ అనే విద్యార్థినికి 24 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర నైరాశ్యానికిలోనై బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుంది. కొద్ది రోజుల క్రితం వెల్లూపురంకు చెందిన ప్రతిభ (19) కూడా నీట్ పరీక్ష తప్పి నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుంది. విచిత్రంగా నీట్ మరణాలు రాజకీయ రంగును పులుముకుంటున్నాయి. హిందీయేతర భాషా విద్యార్థుల పట్ల వివక్షపూరితంగా ఉన్న నీట్ పరీక్షను వ్యతిరేకించాలని డీఎంకే నేత స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కోరడంతో పరీక్ష చుట్టూ రాజకీయ మేఘాలు అలుముకుంటున్నాయి.