జాతీయ వార్తలు

మానస సరోవరంలో చిక్కుకుపోయిన యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాస్: మానససరోవర్ యాత్రలో భక్తులు చిక్కుకున్నారు. నేపాల్‌లోని సిమీకోట్ ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తుండటం వల్ల భక్తులు చిక్కుకుపోయారు. ఈ మేరకు హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేశారు. భక్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మానస సరోవరంలో చిక్కుకున్న తెలుగు భక్తులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ తెలిపారు. నాలుగు హెలికాఫ్టర్లు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే యాత్రీకుల కోసం ఆహారపదార్థాలను, మందులను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యాత్రీకులు స్వస్థలాలకు క్షేమంగా వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ భవన్ అధికారులు ఆదేశించారు.