జాతీయ వార్తలు

మహారాష్టల్రో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 5: ముంబయి- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఆగివున్న రెండుకార్లను వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మొత్తం మూడు వాహనాలు లోతైన గోతిలో పడ్డాయ. కారు టైరు పేలిపోవడం వల్ల అది ఎక్స్‌ప్రెస్‌వేలో నిలిచివుందని, దానిపక్కనే ఓ ఎంయువి కూడా ఆగివుందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్నవారికి సాయపడేందుకు ఎంయువి వాహనంలో వస్తున్న వ్యక్తులు అక్కడ ఆగారని, ఆ రెండు కార్లను వెనుకనుంచి వస్తున్న ఒక టూరిస్టు బస్సు ఢీకొందని, ఫలితంగా ఈ మూడు వాహనాలు 20 అడుగుల లోతైన గోతిలో పడిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ మూడు వాహనాలూ పుణె నుంచి వస్తున్నవేనని తెలిపారు.