జాతీయ వార్తలు

ఇక శిక్షార్హ నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26:పధ్నాలుగు సంవత్సరాల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం ఓ కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా వేసేందుకూ ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఏ వృత్తిలోగానీ, ప్రక్రియల్లో గానీ ఈ వయసు పిల్లల్ని పనివాళ్లుగా పెట్టుకోవడానికి వీల్లేదని ఈ బిల్లులో స్పష్టం చేసిన కేంద్రం కుటుంబ అవసరాల కోసం పిల్లలు పనిచేయడానికి మినహాయింపునిచ్చింది. బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. తాజాగా లోక్‌సభ కూడా దీనికి ఆమోదం తెలుపడంతో దీనిపై పార్లమెంట్ ఆమోద ముద్ర పడినట్టయింది. ఇప్పటి వరకూ బాల కర్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నెలల నుంచి ఏడాది పాటు శిక్ష అమలులో ఉంది. దీన్ని ఆరు నెలల నుంచి రెండేళ్లకు పొడిగించారు. అలాగే జరిమానాను కూడా 50వేల రూపాయలకు పెంచారు. నేర తీవ్రతను బట్టి జైలు శిక్షా లేదా జరిపామా లేదా రెండింటినీ విధించేందుకూ వీలు కల్పించారు. ఈ బిల్లు చారిత్రకమైనది, పధ్నాలుగేళ్ల లోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించిందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

జిఎస్‌టికి షరతులతో
కూడిన మద్దతు: ఈటల

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భావిస్తున్న జిఎస్‌టికి కొన్ని షరతులతో కూడిన మద్దతు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. సమావేశానంతరం రాజేందర్ మాట్లాడుతూ జిఎస్‌టి రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని కేంద్రానికి సూచించామన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని సమావేశంలో కోరినట్టు ఈటల పేర్కొన్నారు. జిఎస్‌టిలో రాష్ట్రాల పన్నుల వాటా, అధికారాల ఎక్కువగా ఉండాలని కోరినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి సిఎస్‌టి బకాయిలు రూ.10,440 కోట్లు పరిహారం రావాల్సి ఉందని, జిఎస్‌టి అమలుకు ముందే ఈ బకాయిలు చెల్లిస్తే ఇరువురి మధ్య విశ్వాసం ఉంటుందని ఆర్థికశాఖ మంత్రుల సమావేశంలో ఈటల స్పష్టం చేశారు.