జాతీయ వార్తలు

ఎన్‌డిఏ ఏడాది పాలనలో 9 లక్షల ఇళ్ళ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ఒక లక్షా 93వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను ఇప్పటివరకు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 9 లక్షల 35వేల ఇళ్లను మంజూరుచేసినట్టు వెల్లడించారు. పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు. ప్రధాని అవాస్ యోజన కింద ఒక్క ఏడాదిలోనే వీటిని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వెంకయ్య స్పష్టం చేశారు.