జాతీయ వార్తలు

పేట్రేగిన ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 14: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. ఓ పక్క విస్తృత స్థాయిలో సైనిక నిఘా, నియంత్రణలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనిక కాన్వాయ్‌పై విరుచుకు పడ్డారు. ఈ దాడిలో ఓ జవాన్ మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని జకూరా ప్రాంతంలో ఈ మెరుపుదాడి జరిగింది.
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ విధులు నిర్వహించిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) జవాన్లను వారి శిబిరానికి తరలిస్తున్న సమయంలో మాటువేసిన ఉగ్రవాదులు ఆకస్మిక కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్‌ఎస్‌బి జవాన్ మరణించాడని, గాయపడిన ఎనిమిది మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని సైనికాధికారి ఒకరు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేసిన సైనికులు మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టు 15న నౌహట్టాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మిలిటెంట్ల దాడి తర్వాత మిలిటెంట్లు మళ్లీ విరుచుకు పడటం ఇదే మొదటి సారి. ఆ ఘటనలో సిఆర్‌పిఎఫ్ కమాండెంట్ మరణించగా, తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారు.