జాతీయ వార్తలు

లేడీడాన్.. పోలీసుల పరేషాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, అక్టోబర్ 14: ఈ ఫోటోలోని మహిళను చూసిన ఎవరైనా ఆమె రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన అత్యంత భయానక డ్రగ్ స్మగ్లర్లలో ఒకరని చెప్పలేరు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సుంతా బిష్ణోయ్ అనే ఈ మహిళకు సంబంధించిన వివరాలు, రాష్ట్రంలో డ్రగ్ రాకెట్‌ను ఎలా నడిపేదనే వాటికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టు కావడానికి ముందు డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా ఆమె నెలసరి ఆదాయం 50 లక్షల రూపాయలుండేదంటే ఆమె ఏ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరిపేదో అర్థమవుతుంది.
ఆరేళ్ల క్రితం సుంతా బిష్ణోయ్ జోధ్‌పూర్‌లోని పార్శ్వనాథ్ కాలనీలో ఒక అద్దె ఇంట్లో ఉండేది. తన సంపాదనలో రెండు పూటలా తిండికి సైతం కష్టపడుతూ ఉండేది. ఆ సమయంలోనే ఆమెకు కల్తీసారా వ్యాపారి అయిన రఘురామ్‌తో పరిచయం ఏర్పడింది. రఘురామ్ గడుపుతున్న విలాసవంతమైన జీవితాన్ని చూసి ముగ్ధురాలయిన సుంతా అతనితో సంబంధాలు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత జైసల్మేర్‌లో మిగతా జోధ్‌పూర్ స్మగ్లర్లకు ఆమెను రాజురాం పరిచయం చేయడంతో వెంటనే ఆమె వారితో కలిసి డ్రగ్స్ సరఫరా చేయడంలో పాలు పంచుకోవడం ప్రారంభించింది. అయితే డ్రగ్స్ స్మగ్లర్లలో కొంతమందిని అరెస్టు చేసిన తర్వాత సుంతా తానే గ్యాంగ్‌కు నాయకత్వం వహించాలని నిర్ణయించుకుందని, తమ బంధువులను ఆ వ్యాపారంలో భాగస్వాములను చేసిందని పోలీసులు చెబుతున్నారు.

చిత్రం... భర్తతో లేడీడాన్ సుంతా బిష్ణోయ్