జాతీయ వార్తలు

మహిళా ఇంజనీర్ సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 25: బిహార్‌లో ఓ మహిళా ఇంజనీర్‌ను సజీవ దహనం చేశారు. సరితాదేవీ (42) అనే జూనియర్ ఇంజనీర్‌ను ఆఫీసులోనే కుర్చీకి కట్చేసి ఈ దారుణానికి ఒడిగట్డారు. ముజఫర్‌పూర్‌లోని మొరౌల్ బ్లాక్‌లో ఆమె జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆఫీసు గదిలోనే ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్లిని ఉద్దేశించి రాసిన లేఖలో తన మృతికి ఎవరూ కారణం కాదని పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సరితాదేవి మాజీ భర్త, ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సరితాదేవికి ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు ఆర్యన్‌తో కలిసి సీతామరిలోని బజరంగ్ విహార్ కాలనీలో ఉంటున్నారు. సరితాదేవి అద్దె ఆఫీసు పక్కనే నివాసం కూడా. మృతురాలి పెద్ద కుమారుడు ధృవ్ మాజీ భర్త విజయ్ నాయక్‌తో కలిసి మరోచోట ఉంటారు. భార్యాభర్తలిద్దరూ పదేళ్లుగా విడిగానే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే ఆర్యన్‌ను అమ్మగారింటికి పంపింది. సంచలం సృష్టించిన ఈ కేసును చాలెంజ్‌గా చేపట్టి విచారణ జరుపుతున్నట్టు ముజాఫరాపూర్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. మాజీ భర్త విజయ్ నాయక్, ఇంటి యజమాని విజయ్‌గుప్తాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. సరితాదేవిని కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆమె జూనియర్ ఇంజనీర్‌గా ఉన్నారు.