జాతీయ వార్తలు

అద్దె ఇంటికోసం వెళ్తే.. అత్యాచారం చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 1: అద్దె ఇంటికోసం భర్తతో వచ్చిన ఓ యువతిని ఇల్లు చూపించడానికి వచ్చిన ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబయి శివార్లలోని జోగేశ్వరి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి శామ్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్యాభర్తలు తమకు తెలిసిన మహిళతో కలిసి అద్దె ఇంటికోసం శామ్‌నగర్ స్లమ్ ఏరియాకు వచ్చారు. రాత్రి పొద్దుపోవడంతో ఆ దంపతులు రాత్రి ఆ మహిళ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చుట్టుపక్కల ఉండే కొంతమంది రాత్రి ఆ దంపతులు ఉంటున్న గదిలోకి చొరబడి, కొంతమంది ఆమె భర్తను మాటల్లో పెట్టి దూరంగా తీసుకెళ్లగా మిగతా వారు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో విషయం తమకు తెలిసిందని, వెంటనే రంగంలోకి దిగి ఉదయానికల్లా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వారిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 4 వరకు పోలీసు కస్టడీకి అప్పగించినట్లు చెప్పారు. నిందితులంతా కూడా చుట్టుపక్కల ఉండే యువకులేనని ఆయన చెప్పారు.