జాతీయ వార్తలు

పదిమందిని చంపి.. తాను ఉరేసుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ, జనవరి 4: ముందు రోజు రాత్రిదాకా ఆ ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. అయితే తెల్లారేసరికి ఇల్లంతా శవాల దిబ్బలాగా మారిపోయింది. ఇంట్లోని మొత్తం 11 మంది శవాలుగా మారి ఉండడం చూసి పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలోని సుకుల్ బజార్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జలాలుద్దీన్ అనే 50 ఏళ్ల వ్యక్తి మంగళవారం రాత్రి భోజనం తర్వాత తన కుమార్తెలు సహా కుటుంబంలోని మొత్తం పది మందికి మత్తుమందు ఇచ్చాడు. శీతాకాలంలో ఆరోగ్యానికి మంచిదని నమ్మించి వారికి ఆ మందు ఇచ్చారు. ఆ మత్తుమందు ప్రభావంతో వారంతా వరండాలో గాఢనిద్రలో ఉండగా అందరి గొంతులు కోసి చంపి ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జలాలుద్దీన్ చంపేసిన వారంతా ఆడవాళ్లే కావడం గమనార్హం. వారిలో అతని కుమార్తెలు అయిదుగురు, తమ్ముళ్ల పిల్లలు కూడా ఉన్నారు. వారంతా కూడా అయిదునుంచి 17 ఏళ్ల మధ్య వయసు వారే. జమాలుద్దీన్ రెండో భార్య జహీదా, ఆమె కుమార్తె ఆఫ్సర్ వేరే గదిలో లోపల తలుపులకు గడియ పెట్టుకుని నిద్ర పోతుండడంతో వారు మాత్రం ప్రాణాలతో బైటపడ్డారు. తమ్ముళ్లు సంసుద్దీన్, రరుూస్‌లు కూడా ఇంట్లో లేరు. కుటుంబం మొత్తానికి సంపాదపరుడు జలాలుద్దీన్ ఒక్కడే. గ్రామంలో అతను బ్యాటరీ, గ్యాస్ రీఫిల్లింగ్ షాపు నడుపుతున్నాడు. తమ్ముళ్లు ఇద్దరికి కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు. అయితే జమాలుద్దీన్ అందరినీ ఎందుకు చంపాల్సి వచ్చిందో కారణం మాత్రం తెలియరావడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.