జాతీయ వార్తలు

సైనిక దుస్తుల్లో ఏడుగురు మిలిటెంట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: మరో వారంలో గణతంత్ర వేడుకలు జరుగనున్న దృష్ట్యా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సైనిక దుస్తుల్లో ఏడుగురు మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం సృష్టించాయి. దీనితో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించి భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆర్మీ కెప్టెన్, సుబేదార్ స్థాయి అధికారులు వేసుకునే సైనిక దుస్తుల్ని ఏడుగురు మిలిటెంట్లు సంపాదించగలిగారని అమృతసర్ నుంచి అందిన నిఘా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తమను ఎవరూ గుర్తించని విధంగా సైనిక దుస్తుల్లోనే వీరు సంచరించడం కనిపించిందని పేర్కొన్న అధికారులు ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడటమే వీరి వ్యూహంగా కనిపిస్తోందని హెచ్చరించారు. ఎప్పుడైతే ఈ మిలిటెంట్ల సంచార సమాచారం వెలుగులోకి వచ్చిందో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పంజాబ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు. ఢిల్లీలోనూ గరిష్ఠ స్థాయిలో అప్రమత్తత పాటిస్తున్న అధికారులు గణతంత్ర వేడుకలకు సంబంధించి బహుల అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించారు.

చిత్రం... ఢిల్లీని ముసిరేస్తున్న మంచును సైతం లెక్కచేయకుండా రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ అట్టహాసంగా సాగుతున్నాయ. బుధవారం రిహార్సల్స్‌లో నిమగ్నమైన ఇండియన్ నేవీ బ్యాండ్ బృందం