జాతీయ వార్తలు

. నమస్కారాలతో సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: చాలా రోజుల తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే వేదికపై కలిశారు. అయితే అది ప్రైవేటు కార్యక్రమం. అనుకోకుండా ఎదురుపడిన ఇద్దరు ముఖ్యమంత్రులూ నమస్కార, ప్రతి నమస్కారాలతో సరిపెట్టుకున్నారు. పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకీ వీరి కలయికకు వేదికైంది... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి కుమార్తె వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చిన విందు కార్యక్రమం. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన లంచ్‌కు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పరస్పరం ఎదురయ్యారు. ఒకరిని చూసి ఒకరు చిరునవ్వుతో నమస్కరించుకున్నారు తప్ప మరో మాట మాట్లాడుకోలేదు. మొదట విందు కార్యక్రమానికి కెసిఆర్ వచ్చారు. ఆయన వేదికపైకి వెళ్లి నవ వధువులను అభినందించి బయటకు వెళుతున్న సమయంలో చంద్రబాబు కారు దిగి లోపలికి వస్తూ కెసిఆర్‌కు ఎదురుపడ్డారు. వెంటనే ఇరువురూ చేతులు జోడించి నమస్కరించుకున్నారు తప్ప ఒక క్షణం ఆగటం లేదా నోరు విప్పి మాట్లాడటం కానీ చేయలేదు. వారి వెంట ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా నమస్కారాలు చేసుకుంటూ వారితో పాటు ముందుకు కదిలిపోయారు.