జాతీయ వార్తలు
తెలుగులో మాట్లాడడమే ఎన్టీఆర్కు అసలైన నివాళి: వెంకయ్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 March 2018
హైదరాబాద్: ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడుకోవాలని , తెలుగు వారంతా తెలుగులో మాట్లాడడమే ఎన్టీఆర్కు అసలైన నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించడం సంతోషకరమన్నారు. సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజుగా వెంకయ్య అభివర్ణించారు.