హైదరాబాద్

‘పోలాప్రగడ’ స్మారక పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 12: ప్రముఖ రచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తి స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ రచయిత శీలావీర్రాజు, సాహితీవేత్త డా.ద్వానాశాస్ర్తీలకు పోలాప్రగఢ సత్యనారాయణ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ శాస్ర్తీయ గ్రంథాలను కూడా అంగ్లంలోనూ తెలుగులోనూ రచించారని తెలిపారు. వివిధ భాషల్లో అనేక గ్రంథాలను రచించారని కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త డా.పోతుకూచి సాంబశివరావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో రచయిత్రి డా.వాసా ప్రభావతి, రచయిత సుధామ, ప్రపంచ రికార్డుల గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, వంశీ సంస్థల అధ్యక్షుడు వంశీరామరాజు, డా.తెనే్నటి సుధాదేవి, తరుణి సాహితీ సమితి అధ్యక్షురాలు పోలాప్రగడ రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.