జాతీయ వార్తలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 29 August 2018
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంతేకాదు పెన్షనర్లకు అదనపు ఇన్స్టాల్మెంట్ డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం బేసిక్ పేలో ఉన్న ఏడు శాతం కాకుండా అదనంగా రెండు శాతం డీఆర్ ఇవ్వనున్నారు. పెంచిన డీఏ, డీఆర్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6112 కోట్ల అదనపు భారం పడనుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 62.03 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది.