జాతీయ వార్తలు

బెంగాల్‌లో గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: పోలింగ్ అధికారి ఆకస్మికంగా గుండెపోటుకు లోనై మరణించిన ఘటన బుర్ద్వాన్ జిల్లాలో సోమవారం జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండోవిడత పోలింగ్ సందర్భంగా బుర్ద్వాన్ జిల్లా పండవేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 234 నెంబర్ పోలింగ్ బూత్ వద్ద పరిమళ్ బౌరీ అనే అధికారి విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా గుండెపోటుకు లోనై తుదిశ్వాస విడిచారు. దీంతో మృతదేహాన్ని తరలించేందుకు పోలింగ్‌ను కొంత సేపు నిలిపివేశారు. మరో అధికారిని అక్కడ నియమించి పోలింగ్‌ను యథాప్రకారం కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.