జాతీయ వార్తలు

పుట్టింగళ్ ఘటనలో 144కు చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం: కొల్లం జిల్లా పుట్టింగళ్‌లో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గురువారం మరో వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 144కు చేరింది. తీవ్ర గాయాలతో సుమారు 300 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు కేరళ సిఎం ఊమెన్ చాందీ ప్రకటించారు. ఈ కమిటీ ఆలయ పరిసరాలను సందర్శించి బాణసంచా ప్రమాదంపై వివరాలు సేకరించి, బాధితుల సహాయానికి సిఫార్సులు చేస్తుంది.