జాతీయ వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించలేదు: రాహుల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మహాత్మా గాంధీ హత్య విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను తాను నిందించలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో రాహుల్‌ తరఫున ఆయన న్యాయవాది కపిల్‌ సిబాల్‌ రాహుల్‌ స్పందన కోర్టుకు తెలియజేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులను మాత్రమే అన్నానని చెప్పినట్లు సిబాల్‌ తెలిపారు. రాహుల్‌ సమాధానంతో కోర్టు పరువునష్టం దావాను కొట్టేసే అవకాశం ఉంది. రాహుల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ మొత్తాన్ని నిందించలేదనే విషయం అర్థమవుతోందని కోర్టు పేర్కొంది.దీనిపై తదుపరి విచారణ సెప్టెంబరు 1న జరగనుంది.