జాతీయ వార్తలు
మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 July 2018
న్యూఢిల్లీ: లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ మాట్లాడుతూ మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఒప్పందం దగ్గర నుంచి పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ పన్ను వరకు మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ ప్రసంగించారు. రాహుల్ తన ప్రసంగం చివరలో ‘‘మీరు నన్ను పప్పు అన్నా మిమ్మల్ని ద్వేషించను’’ అని తన ప్రసంగాన్ని ముగించారు. వెంటనే తన సీటు నుంచి నడుచుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ హఠత్పారిణామంతో మోదీ అవాక్కయ్యారు. సభ్యులు, మీడియా కూడా ఆశ్చర్యపోయారు. తరువాత తేరుకున్న మోదీ రాహుల్ భుజం తట్టి బాగా మాట్లాడవు అని అభినందించారు.