జాతీయ వార్తలు

సొంత నిర్ణయాలతో థేశాన్ని నడపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజల మాట వినాలని, ప్రజాప్రతినిధులు, మంత్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అధికారవర్గాల సూచనలు అర్థం చేసుకోవాలని, కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్‌గాంధీ హితవు చెప్పారు. అంతే తప్ప సొంత నిర్ణయాలతో దేశాన్ని నడపలేరని ఆయన అన్నారు. లోక్‌సభలో ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీ వట్టిపోయిందని విమర్శించారు. ఉద్యోగాలు దక్కాయా అని ఎవరిని అడిగినా లేదంటున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ను ఇరుకునపెట్టిన యుపిఎ విధానాన్ని మోదీ ప్రభుత్వం ఒక్క చర్యతో దెబ్బతీసిందని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రోహిత్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, జెఎన్‌యులో కన్నయ్య ఉపన్యాసం ఆసాంతం తాను విన్నానని, 20 నిమిషాల ప్రసంగంలో ఒక్కమాటకూడా దేశానికి వ్యతిరేకంగా లేదని, కానీ కన్నయ్య జైలులో ఇప్పటికీ ఉన్నాడని ఆయన అన్నారు. మోదీపై సూటిగా, పదునైన విమర్శలతో రాహుల్ ప్రసంగం కొనసాగింది.