జాతీయ వార్తలు

మాటకు కట్టుబడి ఉన్నా: మళ్లీ రాహుల్‌ యూటర్న్‌!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణమన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి యూటర్న్‌ తీసుకున్నారు. 'ఆరెస్సెస్‌ విద్వేషపూరిత అజెండాపై పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. నేను అన్న ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను' అని రాహుల్‌ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
రాహుల్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు వినిపిస్తూ- మహాత్మాగాంధీ హత్యకు కారణమంటూ ఆరెస్సెస్‌ను ఒక సంస్థగా రాహుల్‌ నిందించలేదని, దానితో అనుబంధమున్న వ్యక్తులే గాంధీజీ హత్యవెనుక ఉన్నారని పేర్కొన్నారని తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలపై రాహుల్‌ వెనుకకు తగ్గినట్టు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి స్పందిస్తూ, ఆరెస్సెస్‌పై తాను అన్న ప్రతి మాటకు కట్టుబడ్డానని స్పష్టంచేశారు.