జాతీయ వార్తలు
ఇద్దరు పిల్లల విధానానికి సడలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 July 2018
జైపూర్: ఇద్దరు కన్నా ముగ్గురు పిల్లలు కలిగితే పదవీ విరమణ తప్పనిసరి చేసిన రాజస్థాన్ ప్రభుత్వం ఆ నిబంధనకు సడలింపు ఇచ్చింది. పదవీ విరమణ తప్పనిసరి చేసే క్లాజ్ను తొలిగించింది. ఈ మేరకు గురువారంనాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజేందర్ రాథోర్ మీడియాతో మాట్లాడుతూ మూడో సంతానం కలిగితే ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తప్పనిసరి చేసే 1996 రాజస్థాన్ సివిల్ సర్వీసెస్, పెన్షన్ రూల్స్, సెక్షన్ 53(ఎ) తొలగిస్తూ కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది.