జాతీయ వార్తలు

రాజీవ్‌కు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఢిల్లీలోని వీర్ భూమి వద్ద రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున్ ఖర్గే తదితరులు కూడా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా రాహుల్ ట్విటర్లో స్పందిస్తూ అందరితోనూ ప్రేమగా, గౌరవంగా మెలగాలని నేర్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక కుమారుడికి తండ్రి ఇవ్వగలిగిన అత్యంత విలువైన బహుమానాలు అవి అని పేర్కొన్నారు.