హైదరాబాద్

తక్కువ ధరకే బంగారం పేరిట బురిడీ .. కోట్లు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, అక్టోబర్ 29: శామీర్‌పేట మండలంలో తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మించి రూ. 1.30 కోట్లు అక్రమంగా వసూలు చేసి బురిడీ కొట్టించిన ఓ వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ తూముకుంటలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 10 గ్రాముల బంగారం రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకే ఇప్పిస్తానని అమాయక ప్రజలను నమ్మించాడు. దీంతో తూముకుంట, ఉద్దెమర్రి గ్రామాలతోపాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి రూ. 1.30 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. తూముకుంట ప్రాంతానికి చెందిన బాధితుడు హన్మంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ తెలిపారు.