జాతీయ వార్తలు

‘పెద్దల సభ’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: 15 రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి మే 31 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 11న సంబంధిత రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. యుపి నుంచి అత్యధిక సంఖ్యలో 11 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు పదవీ విరమణ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఏడుగురు మంత్రులు కూడా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.