క్రీడాభూమి

కొరియా మాస్టర్స్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోగ్‌విపో, డిసెంబర్ 10: కొరియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ పరాజయాన్ని చవిచూశాడు. గాయాల కారణంగా చాలాకాలం వివిధ టోర్నీలకు దూరమైన అతను ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్న విషయం తెలిసిందే. ఆరంభ రౌండ్స్‌తోనే అతని పోరాటం ముగుస్తున్నది. అయితే, కొరియా మాస్టర్స్‌లో అతను మెరుగైన ఆటతో రాణించాడు. క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరాడు. అక్కడ నంబర్ వన్ సీడ్ సొన్ వాన్ హూ ఎదురుకావడంతో అతనికి ఓటమి తప్పలేదు. వాన్ హూ 23-21, 21-16 తేడాతో కశ్యప్‌ను ఓడించి, సెమీస్‌లో డారెన్ లియూతో పోరును ఖాయం చేసుకున్నాడు. లియూ క్వార్టర్స్‌లో చెన్ చున్ వెయ్‌పై 21-13, 21-7 తేడాతో విజయం సాధించాడు.