జాతీయ వార్తలు

కృష్ణజింకల కేసులో సల్మాన్‌ నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్‌: రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. సినిమా షూటింగ్‌ కోసం 1998లో సల్మాన్‌ రాజస్థాన్‌ వెళ్లారు. జోధ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో సల్మాన్‌ రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన జోధ్‌పూర్‌ కోర్టు రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సల్మాన్‌ రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.