జాతీయ వార్తలు

నిరాహార దీక్షకు స్వస్తి: షర్మిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిల తన ఆందోళనకు స్వస్తి చెప్పబోతున్నారు. ఆగస్టు9న నిరాహార దీక్షను ముగిస్తానని ఆమె మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఇక తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ముక్కుకు అమర్చిన పైపుద్వారా అందించే ద్రవ పదార్థాలతో ఇన్నాళ్లూ ఆమె జీవిస్తున్నారు. ఇంఫాల్‌లోని ఓ బస్టాప్ వద్ద నిలబడి ఉన్న పదిమంది పౌరులను అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనికులు కాల్చి చంపడంతో ఆమె 2000 నవంబర్‌లో తన దీక్ష ప్రారంభించారు. సైనికులకు ప్రత్యేక అధికారాల చట్టం వల్ల మణిపూర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె దీక్ష ప్రారంభించారు.