జాతీయ వార్తలు

సిమికోట్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మానస సరోవర్ యాత్ర ముగించుకుని వస్తున్న తెలుగు యాత్రికులు సిమికోట్‌లో చిక్కుకుపోయారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో యాత్రికులను తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవటంతో హెలికాఫ్టర్‌లను నిలిపివేశారు. గత ఆరు రోజుల నుంచి ఎలాంటి ఆహారం, మందులు లేక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 90 మంది యాత్రికులు ఉన్నట్లు, వీరిలో ఏలూరు మేయర్ భర్తతో పాటు, వారి బంధువులు కూడా ఉన్నట్లు తెలిసింది. యాత్రికులను క్షేమంగా తీసుకురావాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు విజ్ఞప్తిచేశారు.