శ్రీకాకుళం

కొరత లేకుండా విత్తనాల పంపిణీ: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతపట్నం, జూన్ 10: పాతపట్నం పిఎసిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులకు విత్తనపంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయిలో రైతులకు విత్తనాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మండలంలో పుగడవెల్లిగెడ్డ, కుమ్మగెడ్డ, రేణుకోడగెడ్డ వంటి సాగునీటివనరులను అభివృద్ధి పరిచే దిశలో ప్రతీ 500 మీటర్లకు ఒక చెక్‌డ్యామ్‌ను నిర్మించి భూగర్భ జలాలను అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపడతామన్నారు. కరవు మండలాలకు పంట పొలాల వద్ద ఫారంఫాల్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు. పిఎసిఎస్ అధ్యక్షుడు మిరియాపల్లి శ్యాంసుందరరావు, గంగువాసుదేవరావు, పైల లచ్చుమయ్య, ఎస్.మధుబాబు, ఎంపిపి కొళ్ల శారద, జెడ్‌పిటిసి ప్రతినిధి సీమ రామకృష్ణ పాల్గొన్నారు.