క్రీడాభూమి

మహిళల హాకీ భారత్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: మహిళల హాకీలో భాగంగా శనివారం అర్జెంటీనాను ఢీకొన్న భారత్ 0-5 తేడాతో చిత్తయింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ పోటీని ఇవ్వలేకపోయిన భారత జట్టు నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించింది. మార్టినా కవలెరో, మరియా గ్రానట్, లెబెచి, అగస్టా అల్డెర్టారిమో, డెల్ఫినా మెరినో అర్జెంటీనాకు గోల్స్ అందించారు. పూర్తి ఆత్మ రక్షణలో పడిన భారత మహిళలు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. ఈ పరాజయంతో భారత జట్టు ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. 36 సంవత్సరాల విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిందన్న ఆనందం అభిమానులకు ఎక్కువ సమయం నిలవలేదు. వరుస పరాజయాలు భారత్ పోరాటానికి తెరదించాయి.