క్రీడాభూమి

బంగ్లాదేశ్ టూర్‌కు ఇసిబి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 26: బంగ్లాదేశ్ పర్యటనకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు బంగ్లాదేశ్‌లో ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టులు, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాల్సి ఉంది. అయితే, ఇటీవల ఢాకాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి, 20 మందిని బందీలు పట్టుకొని హతమార్చిన సంఘటనతో ఇసిబి ఆందోళనకు గురైంది. బంగ్లాదేశ్‌కు జట్టును పంపరాదని అనుకుంది. అయితే, ఇసిబి భద్రతా సలహాదారు రెగ్ డిక్సన్, క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్ జాన్ కర్, ప్రొఫెషనల్ క్రికెట్ సంఘం ప్రతినిధి డేవిడ్ లీథర్డాల్ బంగ్లాదేశ్‌కు వెళ్లి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వారు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని, బంగ్లాదేశ్‌కు జట్టును పంపడానికి ఇసిబి సుముఖత వ్యక్తం చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే టూర్ కొనసాగుతుందని ప్రకటించింది. బంగ్లాదేశ్ టూర్ ముగిసిన తర్వాత, అక్కడి నుంచే ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకు వెళుతుంది.