క్రీడాభూమి

టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ ఫైనల్‌కు సానియా జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 23: చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బొరా స్ట్రికోవాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇక్కడ జరుగుతున్న టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్‌లో సానియా, స్ట్రికోవా జోడీ 6-2, 6-2 తేడాతో గాబ్రియేల డబ్రోవ్‌స్కీ (కెనడా), మరియా జోస్ మార్టినా సాంచెజ్ (స్పెయిన్) జోడీపై సునాయాసంగా గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. గత నెల వీరు సిన్సినాటి ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. మరో టైటిల్‌ను అందుకుందుకు ఒక విజయం దూరంలో నిలిచారు.